బోల్తాపడ్డ బస్సు.. నలుగురు మృతి

నవతెలంగాణ – కర్నాటక : బస్సు బోల్తాపడి నలుగురు మృతి చెందిన ఘటన కర్నాటకలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు … నిన్న తెల్లవారుజామున 36 మంది ప్రయాణికులతో ఓ ప్రయివేటు బస్సు బెంగళూరు నుంచి గోకర్ణకు వెళుతుండగా, హౌలాలకెరె టౌన్‌ సమీపంలో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా, మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని హెలాల కెరె ఆస్పత్రికి తరలించారు. వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. డ్రైవర్‌ బస్సును అతివేగంగా నడపడంతోనే నియంత్రణ కొల్పోయి బోల్తా పడినట్టు చెప్పారు. మృతుల్లో ఇద్దరిని జగదీష్‌ (45), గణపతి (40)గా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Spread the love