రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఘనంగా స్నేహితుల దినోత్సవం 

నవతెలంగాణ- కంటేశ్వర్
రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో స్థానిక నాగారం నందుగల కాంచ గోశాలలో స్నేహితుల దినోత్సవాన్ని క్లబ్ సభ్యులు అందరూ కలిసి మొక్కలు నాటుతు జరుపుకున్నారు. అని అధ్యక్షులు రామకృష్ణ తెలిపారు. జీవితంలో స్నేహితుల పాత్ర చాలా ముఖ్యమని రోటరీ అంతర్జాతీయంగా కూడా స్నేహం, సేవా అను అంశాలతో ముందుకు వెళుతూ ఉన్నది దీనిని పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆదివారం కొన్ని పండ్లు, నీడనిచ్చే చెట్లను కాంచ గోశాలలో నాటడం జరిగిందని అన్నారు. ఆళ్లదకరమైన సురక్షితమైన స్వచ్ఛమైన గాలిలో స్నేహితుల దినోత్సవం మొక్కలు నాటుతు జరుపుకోవడం సభ్యులందరూ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి కార్యనిర్వహణ అధికారులుగా కమల్ ఇనాని, ధన్పాల్ శ్రీనివాస్ వ్యవహరించారు. కార్యక్రమంలో సభ్యులు క్లబ్ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమారి కోశాధికారి ఇందూరి శ్రీనివాస్, క్లబ్ సర్వీస్ జితేంద్రమాలాని, సభ్యులు కటకం శ్రీనివాస్, రాజ్కుమార్ సుబేదార్, వేద ప్రకాష్ మిట్టల్, దర్శన్ సింగ్, శ్రీరాం సోనీ, జ్ఞాన ప్రకాష్, సుధీర్ గుప్తా, ధీరజ్ రెడ్డి, రమేష్ గుప్తా, శ్యామ్ అగర్వాల్, జుగల్ సోనీ, రామ్మోహన్ రావు,పవన్ పాండే, గోపాల్ కిరణ్ ,ఆకుల సందీప్ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Spread the love