నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరినట్టు ఆపార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు తోట చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈ చేరికలు జరిగాయన్నారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ అధికారం చేపట్టిన నాటి నుంచి, ఆ రాష్ట్రం అభివద్దికి ఆమడదూరంలో ఉందన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు లేక ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారన్నారు. రాష్ట్ర రాజధాని ఏదో కూడా చెప్పుకోలేని దుస్థితిలో అక్కడి ప్రజలు ఉన్నారని విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రజలు బీఆర్ఎస్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని స్పష్టంచేశారు. ఏపీలో తాము ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగామని చెప్పారు. ఈసందర్భంగా పార్టీలో చేరిన నేతలకు గులాబీ కండువాలు కప్పి ఆహ్వానం పలికారు.