నవతెలంగాణ- హైదరాబాద్ : జులై 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-4 ఎగ్జామ్ నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ క్రమంలో 24వ తేదీ నుంచి టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. జులై 1న రెండు సెషన్లలో ఉదయం జనరల్ స్టడీస్ పేపర్, మధ్యాహ్నం మ్యాథ్స్ పేపర్ పరీక్ష నిర్వహించనున్నారు.