గయానా పాఠశాలలో అగ్ని ప్రమాదం

– 20 మంది చిన్నారులు మృతి
జార్జ్‌ టౌన్‌ (గయానా) : గయానాలోని ఒక పాఠశాల వసతిగృహంలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో 20 మంది చిన్నారులు మృతి చెందారు. అనేక మంది గాయాలపాలైనట్లు అధికారులు తెలిపారు. మహదియా పట్టణంలోని ఒక సెకండరీ పాఠశాలకు చెందిన వసతి గృహంలో ఈ అగ్ని ప్రమాదం జరిగిందని గయానా ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. సోమవారం తెల్లవారుజామను చిన్నగా ప్రారంభమైన అగ్ని ప్రమాదం తరువాత ఒక్కసారిగా భవనం మొత్తం వ్యాపించాయని తెలిపింది. అదే సమయంలో భారీ ఉరుములు, తీవ్రమైన గాలులతో వర్షం కురువడంతో సహాయక కార్యక్రమాలకు ఆటకం కలిగిందని ప్రభుత్వం తన ప్రకటనలో తెలిపింది. అయినా చిన్నారులను రక్షించడానికి సహాయక బృందాలు శక్తి మేరకు అన్ని ప్రయత్నాలు చేశాయని తెలిపింది. అనేక మందికి గాయాలయ్యాయని, ఇందులో ఏడుగుర్ని చికిత్స కోసం రాజధాని జార్జ్‌ టౌన్‌ తరలించినట్లు అధికారులు చెప్పారు.

Spread the love