మెల్బోర్న్ : ఆస్ట్రేలియాలోని సిడ్నిలో పర్రామట్టా నగర కౌన్సిల్కు నూతన మేయర్గా తొలిసారిగా భారత సంతతికి చెందిన సమీర్ పాండే ఎన్నికయ్యారు. అంతకు ముందు 2017 నుంచి 2022 ఈ నగర డిప్యూటీ మేయర్గా సమీర్ పాండే బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం మేయర్గా ఉన్న డోన డేవిస్ పార్లమెంట్కు ఎన్నికకావడంతో నూతన మేయర్గా సమీర్ పాండేను ఎన్నుకున్నారు. ఒక చిన్న ఐటి సంస్థకు యజమాని అయిన సమీర్ పాండే వ్యక్తిగత ఆసక్తితో రాజకీయాల్లో చేరారు.