నవతెలంగాణ -రేవల్లి
రేవల్లి మండలానికి సంబంధించిన రాములు కూతురు మాన్య (22) పది నెలల క్రితం, పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామానికి చెందిన శ్రీనుకు పెద్దల సమక్షంలో పెండ్లి జరిపించారు. మూడు నెలల వరకు బాగానే ఉన్నారు, ఆ తర్వాత భర్త రోజు తాగి వచ్చి అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని, అత్తమామలు కూడా వేధించడంతో మాన్య అనే అమ్మాయి తన పుట్టిన ఊరు మండల కేంద్రంలో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఎస్సై శివ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.