మార్క్సిజంతోనే పెట్టుబడి దారీ సమాజం నుండి మానవాళికి విముక్తి: కనకయ్య

నవతెలంగాణ – అశ్వారావుపేట
పెట్టుబడి దారీ సమాజం నుండి మానవాళికి విముక్తి కలగాలంటే మార్క్సిజం నుండే సాద్యం అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరం కనకయ్య అన్నారు. పార్టీ మండల కమిటీ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న గత రెండు రోజులు గా వినాయకపురం లో నిర్వహిస్తున్న మండల స్థాయి శిక్షణా తరగతులకు గురువారం ఆయన హాజరయ్యారు. గురువారం ముగిసిన శిక్షణా తరగతులకు మండల కమిటీ సభ్యులు గంగరాజు ప్రిన్సిపాల్ వ్యవహరించారు. రెండో రోజు “పార్టీ నిర్మాణం” అనే అంశాన్ని కనకయ్య బోధించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్క్సిస్టు పార్టీ కార్యకర్తగా రాణించాలంటే సమాజాన్ని నిర్ధిష్టంగా అధ్యయనం చేయాలని అన్నారు.అధ్యయనం తో అవగాహన,అవగాహన తో సమస్య పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని తెలిపారు.ప్రతీ కార్యకర్త నిర్మాణాత్మకంగా పనిచేస్తేనే పార్టీ పురోభివృద్ధి చెందుతుందని తెలిపారు.ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించడం, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి కావాల్సిన ఆందోళనలు,నిరసనలు చేపట్టడం ద్వారా ప్రజలు పార్టీ పట్ల ఆకర్షితులు అవుతారని అన్నారు. అనంతరం జిల్లా కార్యదర్శి వర్గం సభ్యులు పుల్లయ్య శిక్షణా తరగతులు ముగింపు ఉపన్యాసం ఇచ్చారు. ఈ శిక్షణా తరగతులు ఏర్పాట్లను మండల కార్యదర్శి బి.చిరంజీవి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అన్నవరం సత్యనారాయణ,మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love