ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతారా..?

– ఎంపీటీసీ మంజుల దస్తప్ప
నవతెలంగాణ-కొడంగల్‌
దౌల్తాబాద్‌ మండల కేంద్రంలో నెలకొన్న పలు సమస్య లపై అధికార నాయకులను యువకులు ప్రశ్నిస్తే ఓర్చు కోలేని నాయకులు నోటికొచ్చినట్టు తిడుతూ కుటుంబ సభ్యు లకు ఫోన్లు చేసి బెదిరిస్తునరాని ఎంపీటీసీ మంజుల దస్తప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ ఉన్న సమస్యలను లేవనేత్తితే పరిష్కరించాల్సింది పోయి పగ పెంచుకుంటున్నారన్నారు. ప్రశ్నిస్తే దాడులకు కూడా వెనకడమనట్టు భయందోళనకు గురి చేస్తున్నారన్నారు. ఇంకొందరు ఇండ్లపైకి వచ్చి హెచ్చరికలు చేస్తున్నారన్నారు. మండలంలో రౌడీ నాయకులు ఎక్కువయ్యారని ప్రజల హక్కులను హరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగే మీ అహంకారం కొనసాగితే చూస్తూ ఊరుకోబోమని ప్రజా స్వామ్య పద్దతిలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

Spread the love