– సాయి ప్రణీత్ పరాజయం
– యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్
కౌన్సిల్ బ్లఫ్స్ (యుఎస్ఏ) : యుఎస్ ఓపెన్లో భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి షట్లర్లు పి.వి సింధు, లక్ష్యసేన్ శుభారంభం చేశారు. పి.వి సింధు మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్లోకి అడుగుపెట్టగా.. పురుషుల సింగిల్స్లో లక్ష్యసేన్ తొలి రౌండ్లో అలవోక విజయం సాధించాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో క్వాలిఫయర్, అమెరికా అమ్మాయి దిశ గుప్తపై 21-15, 21-10తో సింధు వరుస గేముల్లో గెలుపొందింది. మెన్స్ సింగిల్స్లో లక్ష్యసేన్ 21-8, 21-16తో ఫిన్లాండ్ షట్లర్పై ఏకపక్ష విజయం నమోదు చేశాడు. సీనియర్ షట్లర్ బి. సాయిప్రణీత్ తొలి మ్యాచ్లో 21-16, 14-21, 19-21తో చైనా షట్లర్, రెండో సీడ్ లి షి ఫెంగ్తో పోరాడి ఓడాడు. యువ షట్లర్ గద్దె రుత్విక శివాని 14-21, 11-21తో వరుస గేముల్లో చైనీస్ తైపీ అమ్మాయి చేతిలో పరాజయం పాలైంది.