స్వచ్ఛమైన త్రాగునీటి ప్లాంట్ ఏర్పాటుకు శ్రీకారం

నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని బుస్సాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛమైన త్రాగునీటి ప్లాంటు ఏర్పాటుకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. గ్రామస్తులు స్వచ్ఛమైన త్రాగునీటి ప్లాంట్ ఏర్పాటు కొరకై బాలవికాస సంస్థను గత సంవత్సరం నుండి సంప్రదిస్తున్న క్రమంలో  సంస్థ మేనేజ్మెంట్  గ్రామస్తులతో మీటింగ్లో పాల్గొని వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు అంగీకారం తెలియజేసినారు. దీనికి గ్రామ పెద్దల సమక్షంలో ఒక కమిటీని నియమించి ఈరోజు నుండే ప్లాంట్ పనులకు శ్రీకారం చుట్టినారు. ప్లాంట్ ఏర్పాటుకు సహకరించిన బాలవికాస సంస్థకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేసినారు. ఈ కార్యక్రమంలో బాలవికాస ప్రతినిధులు వై బాల మోహన్ రెడ్డి  మరియు ఎస్ విమల్  మరియు గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో మహిళలు ప్రజలు పాల్గొన్నారు.
Spread the love