మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్ గా రేపాక తిరుపతి ముదిరాజ్

నవతెలంగాణ – తొగుట
నాపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన  సీఎం రేవంత్ రెడ్డి, మెట్టు సాయి కుమార్ కు కృత జ్ఞతలని టీపీసీసీ ఫిషర్ మెన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేపాక తిరుపతి ముదిరాజ్ అన్నారు. శుక్రవారం ఒక ప్రకటన ద్వారా తెలుపుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో అధిక స్థానాలు గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన రాష్ట్ర ఫిష ర్మెన్ మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, టీపీసీసీ, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని పార్లమెంట్ నియోజకవర్గలకు ఇంచార్జ్ లను నియమించారని తెలిపారు. మెదక్ పార్లమెంట్ ఇంచార్జిగా నాకు బాధ్యతలు అప్పగించడం గొప్ప విషయం అన్నారు. తనపై నమ్మకంతో ఈ బాధ్య తను అప్పగించిన ఫిషర్మేన్ కార్పొరేషన్ ఫెడరేషన్ చైర్మన్, సీఎం రేవంత్ రెడ్డి, ఇంచార్జ్ మంత్రి కొండా సురేఖ, దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని దక్కిచ్చుకున్నాట్లు, పార్ల మెంట్ ఎన్నికల్లో బారి మెజార్టీ సాధించేలా, అంద రు నాయకుల సమాన్వయంతో పనిచేస్తామని అన్నారు.
Spread the love