సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ విగ్రహావిష్కరణకు మంత్రికి ఆహ్వానం

– గౌడ సంఘం నాయకులు
నవతెలంగాణ-కందుకూరు
ఆగస్టు 6వ తేదీన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల కేంద్రంలో సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ విగ్రహావిష్కరణకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆహ్వానించారు. సోమవారం గౌడ సంఘం నాయకులు మంత్రి నివాసంలో ఆమెతో భేటీ అయ్యారు. సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ విగ్రహ ఆవిష్క రణకు ముఖ్యఅతిథిగా విచ్చేసి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలని మంత్రికి ఆహ్వానపత్రిక అందజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా మంత్రిని కలిసిన వారిలో గౌడ సంఘం నాయకులు ఆనగౌని అంజయ్యగౌడ్‌, సదానంద్‌గౌడ్‌, సరికొండ వెంకటేష్‌గౌడ్‌, తోకల రాజుగౌడ్‌, దామోదర్‌గౌడ్‌, సిద్దేశ్వర్‌ గౌడ్‌, రవీందర్‌గౌడ్‌, సౌడపు వెంకటేష్‌గౌడ్‌, రాకేష్‌గౌడ్‌, శివ శంకర్‌గౌడ్‌, మక్తాల వెంకటేష్‌గౌడ్‌, కృష్ణగౌడ్‌, బాలరాజ్‌గౌడ్‌, వెంకటేష్‌గౌడ్‌, కృష్ణ గౌడ్‌, శ్రీనివాస్‌గౌడ్‌ ఉన్నారు. బహిరంగ చర్చకు సిద్ధమా…?

Spread the love