– సమస్యను పరిష్కరించాలని సీఐటీయూ డిమాండ్
నవతెలంగాణ -గజ్వేల్
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపా లిటీ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంతో పాటు సీసీ రోడ్లు పూర్తి చేయాలని సీఐ టీ యూ గజ్వేల్ డివిజన్ నాయకులు బండ్ల స్వామి డిమాండ్ చేశారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వార్డులలో ప్రజానీకం ఎక్కువగా నివ సిస్తున్న కాలనీ లలో ముం దుగా సిసి రోడ్డు పూర్తి చేయకుండా ప్రాధాన్యత లేని రోడ్లలో సిసి రోడ్లు నిర్మించినట్లు ఆయన చెప్పారు. వార్డులలోని అసంపూర్తిగా ఉన్న రోడ్లను వదిలేసినారని ఇదేమిటని ప్రజానీకం అడిగితే అదనపు నిధులు వస్తే కానీ చేయలేమని ప్రజా ప్రతినిధులు అధికారులు తెలపడం సిగ్గుచేటన్నారు. మాటలతో కాలం వెళ్ళదీస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలోని పట్టణ కేంద్రంలో ఈ దుస్థితేమిటన్నారు. వెంటనే నిధులు మంజూరు చేసి పనులు పూర్తయ్యేలా చూడాలని కోరారు. లేని పక్షంలో పట్టణ ప్రజలతో కలిసి ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు