జూన్‌ 3న గీతం 14వ స్నాతకోత్సవం

ముఖ్య అతిథిగా ఐఎస్‌ఓ వ్యవస్థాపక డీన్‌ ప్రమత్‌ రాజ్‌ సిన్హా
గౌరవ డాక్టరేట్‌ అందుకోనున్న ఎమ్మెల్సీ గోరటి వెంకన్న
నవతెలంగాణ-పటాన్‌చెరు
గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం 14వ పట్టాల ప్రదానోత్సవం (స్నాతకోత్సవం) గీతం హైదరాబాద్‌లో జూన్‌ 3 న మధ్యాహ్నం 2.30 గంటలకు నిర్వహించనున్నట్టు గీతం హైదరాబాద్‌ ప్రో వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ డీ.ఎస్‌. రావు వెల్లడించారు. గీతం హైదరాబాద్‌ ప్రాంగణంలో ఇంజ నీరింగ్‌, మేనేజ్‌ మెంట్‌, సైన్స్‌, ఫార్మసీ, హ్యుమానిటీస్‌, అర్కి టెక్చర్‌ కోర్సులను 2022-23 విద్యా సంవత్సరం నాటికి పూర్తిచేసిన విద్యార్థులు, డిగ్రీలు, డిప్లొమోలు పొందడానికి అర్హులన్నారు. గీతం కులపతి డాక్టర్‌ నరందర్‌ సింగ్‌ చౌహాన్‌ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో గీతం అధ్యక్షుడు ఎం. శ్రీభరత్‌తో పాటు ముఖ్య అతిథిగా ఇండి యన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌ఓ) వ్యవస్థాపక డీన్‌ ప్రొఫెసర్‌ ప్రమత్‌ రాజ్‌ సిన్హా ముఖ్య అతిథిగా పాల్గొంటారన్నారు. ఈ కార్యక్ర మం లో ప్రముఖ కవి, గాయకుడు, తెలంగాణ ఎమ్మెల్సీ గోర టి వెంకన్నకు గౌరవ డాక్టరేట్‌ను ప్రధానం చేస్తామన్నారు. ఇత ర వివరాల కోసం గీతం వెబ్‌సైట్‌ షషష.స్త్రఱ్‌aఎ.వసబను సందర్శించాలని ప్రోవీసీ సూచించారు.

Spread the love