పేదలకు భరోసా సీఎంరిలీఫ్‌ ఫండ్‌

– హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీష్‌ కుమార్‌
నవతెలంగాణ హుస్నాబాద్‌ రూరల్‌
పేద ప్రజల సిఎం రిలీఫ్‌ ఫండ్‌ ఎంతో భరోసానిస్తుందని హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీష్‌ కుమార్‌ అన్నారు. సోమవారం హుస్నాబాద్‌ ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో సీఎం సహాయ నిధిలో నలుగురు లబ్ధిదారులకు రూ 1లక్ష 52 వేల రూపాయల చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్‌ కుమార్‌ మాట్లాడుతూ ఆపదలో ఉన్న కుటుంబాలకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ఆపన్నహస్తంలా ఉపయోగపడుతుందన్నారు.వ్యాదుల బారిన పడి, చికిత్సకు నోచుకోలేని నిరుపేదల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం సహాయ నిధితో అండగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లకవత్‌ మానస సుభాష్‌, బిఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వంగ వెంకట్రామిరెడ్డి, మీర్జాపూర్‌ సర్పంచ్‌ తరాల లతా మహేందర్‌, అక్కలపేట ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షులు యాస శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love