కందకుర్తి గోదావరి త్రివేణి సంగమంలో ఘనంగా గంగా హారతి

నవతెలంగాణ- రెంజల్: నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి గోదావరి త్రివేణి సంగమంలో సాయంత్రం మల్లారం లింగేశ్వర ఆలయ బాలయోగి పిట్ల కృష్ణస్వామి మహారాజ్ ఆధ్వర్యంలో గంగా హారతి నిర్వహించారు. కార్తీక మాసం పూర్తి కావడంతో ఆయన లింగేశ్వర ఆలయం నుంచి పాదయాత్రగా బయలుదేరి సాయంత్రానికల్లా గోదావరి తీరానికి చేరుకున్నారు. ఆయన వెంట మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలుకుతూ గోదావరి తీరానికి చేరుకోగా భక్తులు ఆయనకు స్వాగతం పలికారు. హిందూ ధర్మ రక్షణ కోసం ప్రతి ఒక్కరు భక్తిశ్రద్ధలతో ఉండాలని ఆయన సూచించారు. అనంతరం వేదమంత్రాల మధ్యన గంగమ్మ తల్లికి హారతి ఇచ్చారు.
Spread the love