సీఎంపై వ్యాఖ్యలు.. కర్ణాటక బీజేపీ కార్యకర్త అరెస్ట్!

నవతెలంగాణ -కర్ణాటక: సీఎం సిద్ధరామయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ కార్యకర్త శాకుంతలను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఉడిపి కళాశాల ఘటనను బీజేపీ సొమ్ము చేసుకోవాలని భావిస్తోందని కాంగ్రెస్ నేత పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన శాకుంతల సిద్ధరామయ్య భార్యకో, ఆయన మనవరాలికో ఇలా జరిగితే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు శాకుంతలను అరెస్ట్ చేసి, ఆ తర్వాత విడుదల చేశారు. ఉడిపిలోని ఓ ప్రయివేటు కాలేజీ టాయిలెట్‌లో ఇటీవల ముగ్గురు విద్యార్థులు రహస్యంగా వీడియో రికార్డ్ చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. మరుగుదొడ్డిలో ఒక విద్యార్థి ఫోన్ దొరకగా, దానిని పరిశీలించిన యాజమాన్యం అందులో ఎలాంటి అనుమానించదగిన డేటా లేదని నిర్ధారించింది. విద్యార్థిని కూడా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదు. అయినప్పటికీ యాజమాన్యం పోలీసులకు పోలీసులకు సమాచారం ఇచ్చింది. అలాగే, వీడియో తీసినట్లుగా అనుమానం ఉన్న ముగ్గురిని ఆదివారం సస్పెండ్ చేసింది.

Spread the love