గడ్డం వంశీని భారీ మెజారిటీతో గెలిపించండి: కొమ్ము వేణు

నవతెలంగాణ – గోదావరిఖని
పెద్దపల్లి  పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  మెజారిటీతో గెలిపించాలని రామగుండం 45వ డివిజన్ కార్పొరేటర్ కొమ్ము వేణు పిలుపునిచ్చారు. సోమవారం 45 డివిజన్ లో రామగుండము ఎమ్మెల్యే  రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్  ఆదేశాల మేరకు గడపగడపకు వెళ్లి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ ను భారీ మెజారిటీ తో గెలిపించాలని డివిజన్ లో ప్రజలందరిని కోరారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలని వారికీ వివరించి హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 45  డివిజన్ అధ్యక్షుడు ఎర్రగొల్ల శ్రీనివాస్ మైనార్టీ కార్పొరేషన్ జనరల్ సెక్రెటరీ గులాం ముస్తఫా నాయకులు చొప్పరి శ్రీనివాస్  మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love