మిస్ వరల్డ్ కిరీటం గెల్చుకున్న క్రిస్టినా పిస్కోవా

నవతెలంగాణ – హైదరాబాద్: చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిస్కోవా 71వ ప్రపంచ సుందరి టైటిల్‌ను గెలుచుకుంది. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో శనివారం రాత్రి జరిగిన మిస్ వరల్డ్ 2024 ఫైనల్‌ పోటీల్లో కిరీటం దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 110 దేశాలకుపైగా చెందిన ముద్దుగుమ్మలు ఈ పోటీలో పాల్గొనగా చివరగా చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిస్కోవా కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. గతేడాది విజేత పోలాండ్‌కు చెందిన కరోలినా బియాలావ్‌స్కా తన వారసురాలికి కిరీటాన్ని అందజేశారు. లెబనాన్‌కు చెందిన యాస్మినా జైటౌన్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది.

Spread the love