– ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అధికారం కోల్పోయిన తర్వాత మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు ఎంతో నీతిమంతుల్లా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఎద్దేవా చేశారు. పదేండ్లలో ఎన్నో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబ నేతలను మించిన పవర్ బ్రోకర్లు ఇంకెవరూ లేరని చెప్పారు. శనివారం హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. పదేండ్ల ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదేనన్నారు. తాము చేస్తే సంసారం..వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారంలా బీఆర్ఎస్ నేతలు ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు.