రామ్ చరణ్ కథానాయకుడిగా, శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై జీ స్టూడియోస్ అసోసియేషన్లో నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘జెంటిల్ మేన్’ నుంచి 2.0 వరకు ఒక్కో సినిమాను ఒక్కో విజువల్ వండర్లా తెరకెక్కించి సౌతిండియన్ సినిమాలకు ఓ ప్రత్యేకతను తీసుకొచ్చిన డైరెక్టర్ శంకర్. ఆయన డైరెక్షన్లో రామ్ చరణ్ సినిమా చేస్తారనగానే మెగాభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు పెరిగాయి. దీంతో నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను అందరి అంచనాలను మించేలా రూపొందిస్తున్నారు. నేడు (బుధవారం) రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఎస్.ఎస్.తమన్ సంగీత సారథ్యం అందిస్తోన్న ఈ సినిమా నుంచి ‘జరగండి..’ అనే పాటను విడుదల చేస్తున్నారు. 150 థియేటర్స్లో ఈ పాటను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, సునీల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.