ఓటును సద్వినియోగం చేసుకోవాలి

– ఓటు ప్రాముఖ్యతపై టీం వన్ కళాజాత బృందంతో అవగాహన 
నవతెలంగాణ – మల్హర్ రావు
ఓటుహక్కు ఉన్న ప్రతిఒక్కరూ ఓటును సద్వినియోగం చేసుకోవాలంటూ కళాజాత బృందాల ద్వారా ప్రభుత్వం ఓటుహక్కు ప్రాముఖ్యతపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ముత్తారం లోని హరిపురం లో గ్రామంలో పెద్దపల్లి టీం వన్ పోగ్రామ్ కళాజాత బృందం సభ్యులు సలేంద్ర రాజన్న యాదవ్,రాజనర్సు,ఉదునూరి పద్మ,కొండ్ర వెంకన్న,బుర్ర శంకర్,శ్రావణ్ తదితర కళాకారులు ఓటుహక్కు దాని ప్రాముఖ్యతపై అవగాహన నిర్వహించారు.మతం,వర్గం,జాతి,కులం,బాష ప్రలోభాలకు ఒత్తిడి కాకుండా నిజాయితీగా ఓటు వేయాలని ఆటపాటలతో వివరించారు.ప్రతి ఎన్నికల్లో నిర్ణయంగా ఓటు వేయడంతోపాటు బంధు మిత్రులతో ఓటు వేయించాలన్నారు.
Spread the love