మామిడిపల్లిలో వ్యక్తి హత్య..

నవతెలంగాణ- ఆర్మూర్ 
పట్టణంలోని మామిడిపల్లిలో మద్యం మత్తులో గొడవ జరగగా ఒకరిని హత్య చేసినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సురేష్ బాబు సోమవారం తెలిపారు. ఆదివారం రాత్రి మద్యం తాగుతూ జరిగిన గొడవలో అంజాద్, మెహబూబ్ అనే ఇద్దరు కలిసి విజయ్ (29) ను ఇంట్లోనే హత్య చేశారని, వీరి ఇద్దరిపై గతంలో సైతం కేసులు ఉన్నట్లు తెలిపారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

Spread the love