విద్యా వ్యవస్థ ప్రతిష్టతకు ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమం

నవతెలంగాణ-తాండూర్‌ రూరల్‌
విద్యా వ్యవస్థను ప్రతిష్టత చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమాన్ని చేపట్టిందని గౌతపూర్‌ గ్రామ సర్పంచ్‌ రాజాప్పగౌడ్‌ అన్నారు. శనివారం మరుగుదొడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా విద్య అందుతుందన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్‌ శ్రీనివాస్‌, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఉమారాణి, గ్రామపంచాయతీ కో- ఆప్షన్‌ సభ్యులు పటేల్‌ నారాయణరెడ్డి, కాంట్రాక్టర్‌ చం ద్రశేఖర్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Spread the love