నవతెలంగాణ – బీజాపూర్: ఛత్తీస్గఢ్లో వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఇటీవల కాంకేర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో 29 మంది మరణించగా, తాజాగా బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో ఒకరు చనిపోయారు. ఆదివారం ఉదయం బీజాపూర్ జిల్లాలోని కేస్కుతుల్ అడవుల్లో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ఓ మావోయిస్టు మరణించాడని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నదని చెప్పారు.