జాలరిగా మారిన మంత్రి ఎర్రబెల్లి…

– మత్స్యకారులతో చేపలు పట్టిన మంత్రి
నవతెలంగాణ- పెద్దవంగర
నిత్యం జనంతో మమేకమయ్యే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మృగశిర కార్తె వేళా జాలరిగా మారారు. సందర్భం ఏదైనా జనంలో ఒకడిగా ఉంటూ, వారితో ఇట్టే కలిసిపోవడం ఆయనకే సొంతం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. గురువారం ‘ఊరూరా చెరువు’ పండుగా సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. అందులో భాగంగా మండలంలోని గంట్లకుంట గ్రామంలో మత్స్యకారులు చేపలు పట్టడం మంత్రి కంటపడింది. వెంటనే కాన్వాయ్ ఆపిన మంత్రి, జాలర్లతో కలిసి చెరువు లోకి దిగారు. వల పట్టి, చేపలు పడుతూ, సంబురపడ్డారు. అనంతరం వారితో ముచ్చటించి, వారి సమస్యలు తెలుసుకున్నారు. మత్స్యకారుల ఆదాయం మార్గం పై ఆరా తీశారు. సీఎం కేసీఆర్ చొరవతోనే తెలంగాణకు పూర్వవైభవం వచ్చిందన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపిన కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు.

Spread the love