జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే, మేయర్

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల, నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని శుక్రవారం మున్సిపల్ కార్యాలయం లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పాత కలెక్టర్ గ్రౌండ్ లో మున్సిపల్ పారిశుధ్య వాహనాల ర్యాలీని ప్రారంభించారు.నూతన మున్సిపల్ మంచి నీటి ట్యాంకర్లు, వైకుంఠ రథాన్ని ప్రారంభించారు. (10 మంచి నీటి ట్యాంకర్లు 95 లక్షలు) (వైకుంఠ రథం 16 లక్షలు).నగర పాలక సంస్థ కార్యాలయంలో ముగ్గుల పోటీలను తిలకించారు. ఈ కార్యక్రమంలో నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి , మహిళ కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మీ ,మున్సిపల్ కమిషనర్ కు.చిత్ర మిశ్రా ,కార్పొరేటర్ లు మున్సిపల్ అధికారులు సిబ్బంది బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Spread the love