బి.టి.రోడ్డు పనులని ప్రారంభించిన ఎమ్మెల్యే గణేష్ బిగాల

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల 40వ డివిజన్ గౌతమ్ నగర్ లో బి.టి.రోడ్డు పనులను భూమి పూజ చేసి శుక్రవారం ప్రారంభించారు.(1 కోటి రూ.లు టి యు ఎఫ్ ఐ డి సి నిధులు). ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే బిగల గణేష్ గుప్తా మాట్లాడుతూ.. నిజామాబాద్ నగర సుందరీకరణ చాలా ముఖ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్ ,నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ న్యామతబాద్ శివ చరణ్ ,కో అప్షన్ సభ్యులు టి.చంద్ర కళ, మాజీ కార్పొరేటర్ మాయవార్ సాయిరాం, ఆర్టీసీ శ్రీనివాస్, రవి కుమార్ బి.ఆర్.ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love