మంత్రులకు ఎమ్మెల్యే సీతక్క కృతజ్ఞతలు

నవతెలంగాణ – ములుగు: ములుగులో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రులకు ఎమ్మెల్యే సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ వేదికగా అనేక సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒక్కటేనన్నారు. బీఆర్ఎస్ కు రాంరాం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ములుగును టార్గెట్ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్ను టార్గెట్ చేస్తున్నారంటే.. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అర్థం అవుతోందన్నారు.

Spread the love