నవతెలంగాణ – హైదరాబాద్
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీ-పీసీసీ) కో-ఛైర్మన్గా ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు. చైర్మన్గా మధుయాష్కి గౌడ్ను గతంలోనే నియమించగా తాజాగా కో-ఛైర్మన్, కన్వీనర్తోపాటు 37 మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీని నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం ప్రకటన జారీచేశారు. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్కు గురై, ఇటీవల రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రె్సలో చేరిన పొంగులేటికి ప్రచార కమిటీ కో-ఛైర్మన్ బాధ్యతలు అప్పగించటం గమనార్హం.