– 400 మంది మహిళలపై ప్రజ్వల్ రేవణ్ణ అఘాయిత్యం : రాహుల్ గాంధీ
బెంగుళూరు: హసన్ నియోజకవర్గ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ కుంభకోణంపై రాహుల్గాంధీ ఆరోపణలు చేశారు. అది సెక్స్ స్కాండ్ కాదు, అదో మాస్ రేప్ అని అన్నారు. గురువారం కర్నాటకలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ప్రజ్వల్ రేవణ్ణ ఓ సామూహిక రేపిస్టు అన్న విషయం ప్రతి బీజేపీ నేతకు తెలుసునని, అయినా వాళ్లు ఆ రేపిస్టుకు మద్దతు ఇచ్చారని, జేడీఎస్తో కూటమి ఏర్పాటు చేశారని విమర్శించారు. ప్రజ్వల్ రేవణ్ణ 400 మంది మహిళల్ని రేప్ చేశాడని, వాటి వీడియోలు తీశారని ఆరోపించారు. శివమొగ్గలో జరిగిన సభలో రాహుల్ మాట్లాడుతూ ఆ మాస్ రేపిస్టుకు ప్రధాని మోడీ మద్దతు ఇచ్చారని ఆరోపించారు.