నవతెలంగాణ-రామారెడ్డి : మండలంలోని అన్నారం గ్రామంలో శనివారం జరిగిన శ్రీ ఉమా రామేశ్వర ఆలయ ప్రతిష్ట మహోత్సవానికి హాజరై పట్టువస్త్రాలు సమర్పించిన మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ షబ్బీర్ .ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆహ్వానించినందుకు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.స్వామి వారి ఆశీస్సులు మనందరిపై ఉంటాయని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నాను అన్నారు. ప్రతిష్ఠాపన పూర్తి కావడంతో స్వామి వారు ప్రజలకు దర్శనం ఇస్తారని చెప్పారు. అందరూ ఆ దేవుడిని దర్శించుకొని, తరించాలని సూచించారు. మన పాపాలు పోగొట్టి, పుణ్యాలు కలిగించే వాడే దేవుడు, అందుకే దేవుడు అందరివాడు అన్నారు. దైవ సన్నిధి ఆనందాన్ని పెంచుతుందని, అందరికి పంచుతుంది తెలిపారు.ఇంత గొప్ప కార్యక్రమానికి పూనుకున్న గ్రామస్థులు అభినందనీయులు అని చెప్పారు. ఈ మహత్కార్యానికి పూనుకు కున్న గ్రామ ప్రజలకు అభినందనలు తెలిపారు .ఈ కార్యక్రమంలో నా రెడ్డి మోహన్ రెడ్డి,గి రెడ్డి మహేందర్ రెడ్డి. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మద్ది చంద్రకాంత్ రెడ్డి గారు, యన్ ఆర్ ఐ సెల్ జిల్లా సమన్వయకర్త సుధాకర్ రెడ్డి , యస్ టి సెల్ జిల్లా అధ్యక్షులు నౌసిలాల్ గారు,భిక్నూర్ మండల అధ్యక్షులు బీంరెడ్డి . మహేష్ గణేష్ నాయక్. నరస గౌడ్. సందీప్. ప్రవీణ్. శ్రీధర్. వెంకటేష్. తదిదరులు పాల్గొన్నారు.