రామగిరి మండల బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పోన్నo మౌనిక

నవతెలంగాణ-రామగిరి :  రామగిరి మండల బిజెపి కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు చందుపట్ల సునీల్ రెడ్డి పాల్గొని రాబోయే ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిని గెలిపించాలని పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధిస్తుందని అన్నారు. బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలుగా పొన్నం మౌనిక ను చందనాపూర్ గ్రామానికి చెందిన వారు నియామక పత్రం రామగిరి మండల అధ్యక్షుడు మొలుమూరి శ్రీనివాస్ చేత ఇవ్వడం జరిగింది. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్క బీజేపీ నాయకులకు హృదయపూర్వక అభినందనలు తెలిపింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో బిజెపి శక్తి కేంద్ర ఇన్చార్జీలు బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు.

Spread the love