నవతెలంగాణ-రామగిరి: మండలంలోని కల్వచర్ల గ్రామంలో గల ప్రముఖ పుణ్యా క్షేత్రమైన ఉమ మహేశ్వర స్వామి ఆలయంలో శివ రామ కృష్ణ భజన మండలి ఆధ్వర్యంలో సప్తాహం వేడుకలు బుధవారం ముగిశాయి. వేడుకలు ఏడు రోజుల పాటు వైభవోపేతంగా కొనసాగాయి. భక్తులు పెద్దసంఖ్యలో వచ్చారు. ఆలయంలో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. భజన, సంకీర్తన నిర్వ హించారు. ఆలయ కమిటీ,దాతల సహకారంతో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు .ఆలయ కమిటీ చైర్మన్ కొలిపాక సత్తయ్య ఆధ్వర్యంలో శివ రామ కృష్ణ భజన మండలి సభ్యులకు, అలాగే ఏడు రోజులుగా ఆలయ పరిసరాల్లో పరిశుభ్రత కు పాటుపడుతున్న పారిశుద్ధ్య కార్మికులను శాలువా కప్పి సన్మానించారు. ఆలయ పరిసరాల్లో సే