అలంపూర్‌‌లో తనిఖీలు..భారీగా నగదు సీజ్

నవతెలంగాణ-హైదరాబాద్ : మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా తనిఖీల్లో భాగంగా బుధవారం రూ.6,76,920 స్వాధీనం చేసుకొని గ్రీవెన్స్ కమిటీకి అప్పగించినట్లు ఎస్పీ రితిరాజ్ తెలిపారు. పుల్లూరు చెక్ పోస్ట్​ వద్ద ఐదుగురి నుంచి రూ.3,97,420, ఐజ మండలం వెంకటాపురం స్టేజీలో నిర్వహించిన తనిఖీల్లో ఒకరి నుంచి రూ.95 వేలు, మానవపాడు మండలంలో రూ.70 వేలు, నందిన్నె చెక్ పోస్ట్​ దగ్గర రూ.1,14,500 సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.

Spread the love