ఎంపీ అవినాష్‌ తండ్రి భాస్కర్‌ రెడ్డికి నిమ్స్‌లో చికిత్స

నవతెలంగాణ – హైదరాబాద్‌: వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టైన కడప ఎంపీ అవినాష్‌ తండ్రి వైఎస్‌ భాస్కర్‌ రెడ్డికి నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నారు. చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌లో ఉన్న ఆయన, శుక్రవారం అస్వస్థతకు గురవడంతో అధికారులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నిమ్స్‌కు తీసుకెళ్లాల్సిందిగా వైద్యుల సిఫార్సు చేశారు. ఈ నేపథ్యంలో భాస్కర్‌ రెడ్డిని ఇవాళ నిమ్స్‌కు తరలించారు. అక్కడ ఆయనకు గుండెకు సంబంధించిన పరీక్షలు వైద్యులు చేస్తున్నారు. అత్యవసర విభాగంలో ప్రత్యేక వైద్యుల సమక్షంలో ఈసీజీ, 2డీ ఎకో పరీక్షలను నిర్వహిస్తున్నారు. అనంతరం భాస్కర్‌ రెడ్డిని చంచల్‌గూడ జైలుకు పంపించనున్నట్లు సమాచారం.

Spread the love