‘స్వాతిముత్యం’ సినిమాతో సక్సెస్ఫుల్గా అరంగేట్రం చేసిన యువ కథానాయకుడు బెల్లంకొండ గణేష్ ‘నేను స్టూడెంట్ సార్’తో ప్రేక్షకులకు థ్రిల్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. రాఖీ ఉప్పలటి దర్శకత్వంలో ఎస్వీ2 ఎంటర్టైన్ మెంట్ పై ‘నాంది’ సతీష్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు.
యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ అంచనాలు పెంచాయి.జూన్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి ‘యూ/ఎ’ సర్టిఫికేట్ ఇచ్చింది. ఒక మంచి సినిమా చూసిన అనుభూతి కలిగిందని సెన్సార్ బోర్డ్ సభ్యులు ఈ చిత్ర బృందాన్ని అభినందించారు. సినిమా మొదటి నుంచి చివరి వరకూ చాలా థ్రిల్లింగ్, గ్రిప్పింగ్గా ఉందని కితాబివ్వడం విశేషం. ఈ చిత్రంలో గణేష్కు జోడిగా అవంతిక దస్సాని నటించింది. సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.