నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మొహమ్మద్‌ యూనస్‌కి జైలుశిక్ష

ఢాకా: బంగ్లాదేశ్‌ కార్మిక చట్టాల ను ఉల్లంఘించారంటూ నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత, ప్రొఫెసర్‌ ముహమ్మద్‌ యూనస్‌ (83)ను కోర్టు సోమవారం దోషిగా నిర్థారించింది. యూనస్‌తో పాటు ఆయన సంస్థ ‘గ్రామీణ టెలికామ్‌’లో పనిచేస్తున్న ముగ్గురు సహోద్యోగులకు కూడా ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధించినట్లు ప్రాసిక్యూటర్‌ ఖుర్షీద్‌ అలామ్‌ ఖాన్‌ మీడియాకి తెలిపారు. అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్న నలుగురికి వెంటనే బెయిల్‌ మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణల ను వారు ఖండించారు. బంగ్లాదేశ్‌లో తాను స్థాపించిన 50కిపైగా వ్యాపార సంస్థల్లో ఏ సంస్థ నుంచి లాభం పొందలేదని యూనస్‌ గతంలో వివరణనిచ్చారు. అవి తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని స్పష్టం చేశారు. ఈ కేసు తప్పుడు, రాజకీయ ప్రేరేపితమైనదని ఆయన లాయర్లు పేర్కొన్నారు. ఆయనను వేధించడం మరియు అవమానించడమే ఈ కేసు ఏకైక లక్ష్యమని అన్నారు.
యూనస్‌, ఆయన సహచరులు గ్రామీణ టెలికాం కంపెనీలో కార్మికుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడంలో విఫలమయ్యా రని, ఇది కార్మిక చట్టాలను ఉల్లంఘిం చడమేనని ప్రభుత్వం వాదిస్తున్నారు. కార్మిక చట్టాల ఉల్లంఘన కేసుతో పాటు అవినీతికి సంబంధించి సుమారు 100 ఆరోపణలు యూనస్‌ ఎదుర్కొం టున్నారు. యూనస్‌పై కొనసాగు తున్న న్యాయపరమైన వేధింపులను ఖండిస్తూ గతేడాది ఆగస్టులో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా, ఐరాస మాజీ సెక్రటరీ జనరల్‌ బాన్‌ కీ మూన్‌ సహా 160 మంది ప్రముఖులు సంయుక్తంగా ఓ లేఖను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆయన భద్రత మరియు స్వేచ్ఛపై ఆందోళన చెందుతున్నామంటూ సుమారు 100కి పైగా నోబెల్‌ బహుమతి గ్రహీతలు పేర్కొన్నారు. ప్రధాని షేక్‌ హసీనా ప్రభుత్వం తీసుకున్న రబ్బర్‌ స్టాంప్‌ నిర్ణయాలను బంగ్లాదేశ్‌ కోర్టులు అనుసరిస్తున్నా యని ధ్వజమెత్తారు. ప్రజలలో యూనస్‌ పట్ల ఉన్న ప్రజాదరణను, రాజకీయ అసమ్మతిని అణచివేసేం దుకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనస్‌పై క్రిమినల్‌ చర్యలు ఆయనపై అసమ్మతికి, రాజకీయ ప్రతీకారానికి చిహ్నమని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ పేర్కొంది. ఆయనపై వేధింపులకు తక్షణమే ముగింపు పలకాలని గతేడాది సెప్టెంబర్‌లో పిలుపునిచ్చింది.

Spread the love