తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

నవతెలంగాణ – తిరుమతి: తిరుమలలోని కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో మాఢ వీధులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేసవి సెలవుల కారణంగా కూడా భక్తుల రద్దీ పెరిగింది. దీంతో కంపార్ట్‌మెంట్లు అన్నీ నిండిపోయి భక్తులు గంగమ్మ ఆలయం వరకు క్యూలైన్లో నిలబడి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 36 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న 79,207 మంది భక్తులు దర్శించుకోగా 41,427 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.19 కోట్లు వచ్చిందని తెలిపారు.

 

Spread the love