తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

నవతెలంగాణ – తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వారాంతపు సెలవు దినాలు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్‌మెంట్లు అన్నీ నిండి కృష్ణతేజ గెస్ట్‌హౌజ్‌ వరకు క్యూలో నిలబడ్డారు. నిన్న స్వామివారిని 87,762 మంది భక్తులు దర్శించుకోగా 43,753 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.61 కోట్లు వచ్చిందని వివరించారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.

Spread the love