12న స్కూల్స్, కళాశాలల బంద్: వామపక్ష విద్యార్ధి సంఘాలు

SFI-Vall-posterనవతెలంగాణ – హైదరాబాద్
రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఈ నెల 12 న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, ఇంటర్ కళాశాలల బంద్ నిర్వహిస్తున్నట్లు ఈ బంద్ లో విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని వామపక్ష విద్యార్ధి సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బంద్ పోస్టర్ ఆవిష్కరణ చేశారు.  ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు, అధ్యక్షుడు మూర్తి, ఎ.ఐ.ఎస్.ఎఫ్ నాయకులు పుట్టా లక్ష్మణ్, మణికంఠ రెడ్డి,  పరుశురాం (పి.డి.ఎస్.యు), మహేష్ (పి.డి.ఎస్.యు), రామకృష్ణ(పి.డి.ఎస్.యు), గవ్వ వంశీధర్ రెడ్డి(ఎ.ఐ.ఎస్.బి.), విజయ్(పి.డి.ఎస్.యు. విజృంభణ) మాట్లడారు. రాష్ట్రంలో కార్పోరేట్, ప్రయివేట్ ఫీజులు దందా కోనసాగుతున్న ఇప్పటికీ ప్రభుత్వం వాటి నియంత్రణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. మంత్రులు, ఉపసంఘం, తిరుపతిరావు కమిటీ రిపోర్ట్ బహిర్గతం చేయకపోవడం చూస్తే ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనూకులంగా వ్యవరిస్తున్నట్లుగా ఉందని అన్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా యూనిఫామ్ ఇవ్వలేదు. కోన్ని టైటిల్స్ పాఠ్యపుస్తకాలు పంపలేదు, చదువులు చెప్పే టీచర్లు లేరు. పారిశుద్ధ్య కార్మికులు లేరు, అనేక సమస్యలతో విద్యాసంవత్సరం ప్రారంభమైన నిర్ధిష్టమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవడం లేదు. త్రాగునీరు, మధ్యాహ్న భోజనం బిల్లుల పెండింగ్, ముత్రశాలలు, సరైన మౌళిక సదుపాయాలు లేక ప్రభుత్వ విద్యారంగం గోల్లుమంటుంది. మన ఊరు-మనబస్తీ-మనబడి నిధులు గుత్తేదారులు తూతూమంత్రంగా మాత్రమే పనులు జరిగాయి కానీ ఎక్కడ సరిగ్గా పాఠశాలలకు ఉపయోగ పడింది లేదు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం హామీ అందని ద్రాక్షగా మారింది. ఇంటర్ విద్యార్ధులకు పాఠ్యపుస్తకాలు ఇంకా అందివ్వలేదు. లెక్చరర్స్ లేరు. ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి.
– రాష్ట్రంలో గత నాలుగేళ్ల నుండి ఫీజు రీయంబర్స్ మెంట్స్& స్కాలర్ షిప్స్ 5,177 కోట్లు పెండింగులో ఉన్నాయి. వాటిని కనీసం విడుదల చేయడం లేదు.
– గురుకులాలు, కెజిబివిలు, ఇంటర్ కళాశాలలుగా అఫ్ గ్రేడ్ చేసిన కెజిబివిలు భవనాలు లేక అరకోర సౌకర్యాలతో అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. వాటికి నిధులు లేవు, లెక్చరర్స్, టీచర్స్ లేరు. నాణ్యమైన భోజనం లేక పుడ్ ఫాయిజాన్స్ అవుతున్న ఘటనలు కో కొల్లలు గా ఉన్నాయి.
– రాష్ట్రంలో భారీ సంఖ్యలో టీచర్,లెక్చరర్స్ ఖాళీలు ఉన్నాయి. వాటి భర్తీ చేయడం లేదు, ఒక్క డిఎస్సీ ఇప్పటివరకు వేయలేదు. అందుకే ఈ సమస్యలను పరిష్కారం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను కదిలించి బంద్ నిర్వహిస్తున్నామని ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కారం చేయాలని అన్నారు. అన్ని జిల్లాలో బంద్ విజయవంతం చేయాలని విద్యార్ధి లోకానికి వామపక్ష విద్యార్ధి సంఘాలు పిలుపునిస్తున్నాయి. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో అశోక్ రెడ్డి, సంతోష్, లెనిన్, స్టాలిన్(ఎస్.ఎఫ్.ఐ.) క్రాంతి, నరేష్( ఎ.ఐ.ఎస్.ఎఫ్), రియాజ్(పి.డి.ఎస్.యు), సుమంత్(పి.డి.ఎస్.యు) తదితరులు పాల్గొన్నారు.

Spread the love