దొంగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

People should be alert for thieves– దోమ ఎస్‌ఐ రవిగౌడ్‌
నవతెలంగాణ-దోమ
దొంగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దోమ ఎస్‌ఐ రవిగౌడ్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా ఎస్‌ఐ మాట్లాడుతూ ఇటీవల కాలంలో రాష్ట్రంలో చెడ్డి గ్యాంగ్‌ దొంగల ముఠా కదలికలు పెరిగాయని ప్రజలు అప్రమత్తంగా వుండాలని ఎస్సై పేర్కొన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో అనుమానాస్పదంగా వ్యక్తులు కనిపిస్తే వెంటనే నేరుగా పోలీసులకు లేదా డయల్‌ 100 ద్వారా సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇతర గ్రామాలకు వెళ్లే వారు తాళాలు వేసి పోలీసులకు, పక్కింటి వాళ్లకు సమాచారం ఇవ్వాలని అన్నారు.

Spread the love