కోడిపందాల స్థావరంపై పోలీసులు దాడి

నవతెలంగాణ – అశ్వారావుపేట
కోడి పందేలు నిర్వహిస్తున్న ఓ స్థావరంపై బుధవారం పోలీసులు దాడులు నిర్వహించారు. స్థానిక ఎస్.హెచ్.ఓ ఎస్ఐ శ్రీరాముల శ్రీను తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని అల్లిగూడెం సమీపంలో గల అటవీ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు కోడి పందేలు నిర్వహిస్తుండగా,విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారి దగ్గర నుంచి రెండు పందెం కోడి పుంజు లు, రెండు ద్విచక్రవాహనాలు, రూ.4,500 నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Spread the love