పిటిఆర్ సమస్య కారణంగా విద్యుత్ అంతరాయం

నవతెలంగాణ-భిక్కనూర్ : పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ( పిటిఆర్ ) సమస్య కారణంగా విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ ఏఈ సంకీర్త్ తెలిపారు. భిక్నూర్‌ పట్టణంలోని సబ్ స్టేషన్ లో పిటిఆర్ సమస్యను ఉన్నత అధికారులకు తెలియజేయడం జరిగిందని త్వరలోనే సమస్యను పరిష్కరించి విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకొని జరుగుతుందని తెలిపారు. పవర్ ట్రాన్స్‌ఫార్మర్ సమస్య కారణంగా పట్టణంలో విద్యుత్ అంతరాయం ఉంటుందని సమస్య పరిష్కారం అయ్యేవరకు ప్రజలు విద్యుత్ అధికారులకు సహకరించాలని కోరారు.

Spread the love