వైసీపీ పాలనలో అవినీతి జరిగిందంటూ హైకోర్టులో రఘురామకృష్ణరాజు పిల్

నవతెలంగాణ – అమరావతి: వైసిపి అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ప్రజాధనానికి నష్టం కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఒక్కో శాఖలో జరిగిన అవినీతిపై విపులంగా పిటిషన్‌లో రఘురామ వివరించినట్లు తెలుస్తోంది.

Spread the love