ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న ఆయిల్ఫెడ్ చైర్మన్ రామక్రిష్ణా రెడ్డి..

– మూడు రోజుల పాటు సంస్థ అభివృద్ది పనులు పరిశీలన..
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామక్రిష్ణా రెడ్డి 17,18,19 తేదీల్లో మూడు రోజుల పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా లో పర్యటించనున్నారు. ఈ నేపద్యంలో ఆయన సోమవారం హైద్రాబాద్ నుండి ఖమ్మం జిల్లా కల్లూరుకు రోడ్డు మార్గం చేరుకున్నారు. ఆయిల్ఫెడ్ డి.ఒ ఆకుల బాల క్రిష్ణ కల్లూరు వెళ్ళి స్వాగతం పలికారు. అనంతరం ఆయన కల్లూరు లో సంస్థ నిర్మించబోయే పరిశ్రమ స్థలాన్ని పరిశీలించారు. అక్కడ నుండి ఓ ఫాం ఆయిల్ క్షేత్రాన్ని పరిశీలించిన అనంతరం నేరుగా అశ్వారావుపేట చేరుకుని మంగళవారం దమ్మపేట మండలంలోని సంస్థ కార్యకలాపాలను పరిశీలించనున్నారు.

Spread the love