– కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గ ఇన్చార్జి పామెన భీంభరత్
నవతెలంగాణ-శంకర్పల్లి
పార్లమెంట్ ఎన్నికలలో చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గ ఇన్చార్జి పామెన భీంభరత్ అన్నారు. శుక్రవారం చేవెళ్ల నియోజక వర్గం శంకర్పల్లి మండలంలోని మహాలింగాపురం గ్రామంలోని బీఆర్ఎస్, బీజేపీి, ముస్లిం సోదరులు పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్య కర్తలు భీంభరత్, రంజిత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో కాంగ్రెస్లోకి భారీ వలసలు చేరే అవకాశాలు ఉన్నాయని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలలో చేవెళ్ల నియోజకవర్గంలో భారీ మెజార్టీ సాధించే దిశగా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పటికే ప్రతి గ్రామాన్ని, ప్రతి నాయకుడిని పార్టీలకు అతీతంగా కలుస్తూ, వారిని కాంగ్రెస్లోకి రప్పించడంలో భీంభరత్ అహర్నిశలు కష్టపడుతున్నారనీ అన్నారు. దీంతో రోజురోజుకూ ఆయా పార్టీల నుంచి గ్రామ, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ భీంభరత్ నాయకత్వంపై నమ్మకంతో కాంగ్రెస్లోకి భారీగా చేరుతున్నారని తెలిపారు. నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ, నిరంతరం నియోజకవర్గ అభివృద్ధి కోసం అలుపెరుగని కృషి చేస్తున్న భీంభరత్ నాయకత్వం పార్టీల నాయకులను విశేషంగా ఆకట్టుకుంటోం దన్నారు. ఈ క్రమంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు కృషి చేస్తున్న భీం భరత్ వెంట నడవడానికి వారంతా పార్టీలకతీతంగా తమ సంపూర్ణ మద్దతును తెలుపుతూ కాంగ్రెస్ నాయకత్వంలో పని చేయడానికి భారీగా తరలిరావడం సంతోష కరమన్నారు. మండల స్థాయి నాయకులు, మాజీ సర్పంచ్లు తమ అనుచరులతో కాంగ్రెస్ సభ్యత్వం పుచ్చుకున్నారని అన్నారు. తన నాయకత్వంపై నమ్మకంతో, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తానని హామీనిచ్చారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్ను అధిక మెజార్టీతో గెలిపించి, తమ సత్తా చాటు దామని భీంభరత్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు మహిళా నాయకురాల్లు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.