ఎంసెట్ లో మైనార్టీ గురుకుల కళాశాల విద్యార్థికి ర్యాంకు

నవతెలంగాణ – సిద్దిపేట
నేడు విడుదల చేసిన ఎంసెట్ 2023 ఫలితాలలో తెలంగాణ మైనారిటీ బాలుర గురుకుల కళాశాల విద్యార్థులు ఉత్తమ రాంకులు సాధించారు.
అగ్రికల్చర్ , మెడికల్ విభాగం లో ఎండి.ఖాజా అవేజ్ అహ్మద్  రాష్ట్ర స్థాయి లో 4878 రాంక్ సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరం లో అడ్మిషన్లు జరుగుతున్నవని,  ఎంపీసీ( మైనారిటీ 30 సీట్లు, నాన్ మైనారిటీ 10 సీట్లు), బై పిసి( మైనారిటీ 30సీట్లు, నాన్ మైనారిటీ 10సీట్లు) ఉన్నవని, ఆసక్తి గల విద్యార్థులు కళశాలలో సంప్రదించాలని కళాశాల ప్రిన్సిపల్ రామ్మోహన్ తెలిపారు.  తెలంగాణ మైనారిటీ బాలుర గురుకుల కళాశాల, ఎల్లంకి బిల్డింగ్ కాంప్లెక్స్ లో,  7331170818 నెంబర్ ను మరిన్ని వివరాలకు సంప్రదించాలని కోరారు.
Spread the love