- Advertisement -
నవతెలంగాణ-మిరుదొడ్డి: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ఆరేపల్లి గ్రామం వద్ద ఆర్టీసీ బస్సు, ట్రాలీ ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. దుబ్బాక నుండి JBSకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న ట్రాలీ ఆటో బలంగా ఢీకొట్టడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, ప్రయాణికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాద సమయంలో ఆర్టీసీ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.
- Advertisement -



